top of page

Alert: జులై 1 నుంచి దేశంలో వచ్చిన 10 కీలక ఆర్థిక మార్పులివే



దేశంలో ప్రతి నెలా కొన్ని ఆర్థిక నియమాలలో మార్పులు(financial changes) జరుగుతుంటాయి. కొన్ని కొత్త నియమాలు మారుతుండగా, మరికొన్ని అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో (జులై 1, 2024) అమలైన, అమలు కానున్న కొత్త నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ree

దేశంలో ప్రతి నెలా కొన్ని ఆర్థిక నియమాలలో మార్పులు(financial changes) జరుగుతుంటాయి. కొన్ని నియమాలు మారుతుండగా, మరికొన్ని అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో (జులై 1, 2024) అమలైన, అమలు కానున్న కొత్త నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ నెలలో క్రెడిట్ కార్డ్, డిజిటల్ వాలెట్, గ్యాస్‌కు సంబంధించి సహా పలు కొన్ని కొత్త నియమాలు ఉన్నాయి.

  • మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుకు సంబంధించిన కొన్ని కొత్త నియమాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలో చేసిన మార్పుల ప్రకారం అన్ని బ్యాంకులు భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.


  • జులై 1న దేశంలోని చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం తర్వాత రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 30 తగ్గి రూ. 1646కి చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ.31 తక్కువ ధరకు రూ.1598కి విక్రయిస్తున్నారు. కానీ డొమెస్టిక్ ఎల్‌పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

  • జులై 1 నుంచి మొబైల్ సంబంధిత విషయాలలో అనేక మార్పులు జరిగాయి. మీ సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా దాని లాకింగ్ సమయం 7 రోజులు ఉంటుంది. అంటే 7 రోజుల తర్వాత మాత్రమే మీకు కొత్త సిమ్ వస్తుంది. ఇది కాకుండా మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.




AP Teachers TV WhatsApp Channel
AP Teachers TV WhatsApp Channel

  • దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు కీలక అప్డేట్ ఇచ్చింది. మీ ఖాతాను సంవత్సరాలుగా ఉపయోగించకుంటే జూలై 1 నుంచి అటువంటి నిష్క్రియ ఖాతాలను మూసివేయాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంకు కొద్ది రోజుల క్రితమే ఖాతాదారులకు సమాచారం అందించింది. గత మూడేళ్లలో ఎలాంటి లావాదేవీలు జరగని, ఖాతా బ్యాలెన్స్ జీరోగా ఉన్న ఖాతాల వినియోగదారులు జూన్ 30లోగా KYCని పొందాలని పేర్కొన్నారు. అలా చేయని వారి ఖాతాలను జూలై 1 నుంచి బ్యాంకు రద్దు చేస్తుంది.

  • SBI క్రెడిట్ కార్డ్ నియమాలు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలకు సంబంధించిన మార్పులు నేటి (జూలై 1, 2024) నుంచి అమలులోకి వస్తాయి.

  • ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో పెంచిన ధరలను జులై 3 నుంచి అమలు చేస్తుంది, వోడాఫోన్ జులై 4 నుంచి అమలు చేయనుంది.





AP TEACHERS TV
AP TEACHERS TV


 
 
 

Comments


bottom of page