B.Ed course : మళ్లీ ఒక ఏడాది బీఈడీ
- AP Teachers TV
- Jan 22
- 1 min read
మళ్లీ ఒక ఏడాది బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) ప్రకటించింది. కేంద్ర విద్యా శాఖకు ఇందుకు సంబంధించిన నిబంధనల డ్రాఫ్ట్ను సమర్పించనున్నట్లు ఎన్సీటీఈ

నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ చేసినవారే అర్హులు
న్యూఢిల్లీ, జనవరి 21 : మళ్లీ ఒక ఏడాది బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) ప్రకటించింది. కేంద్ర విద్యా శాఖకు ఇందుకు సంబంధించిన నిబంధనల డ్రాఫ్ట్ను సమర్పించనున్నట్లు ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా సోమవారం వెల్లడించారు.
2014లో ఈ బీఈడీ కోర్సును రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసిన సిఫార్సుల మేరకు మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన లేదా రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయవచ్చని అరోరా వెల్లడించారు. మూడేళ్ల డిగ్రీ చేసినవారు ఈ కోర్సు చేసేందుకు వీల్లేదు. ఆ అభ్యర్థులు రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఒక ఏడాది బీఈడీ కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులతో ఒక కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.












Comments