ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ ఉత్తర్వులు విడుదల.
- AP Teachers TV
- May 2, 2023
- 1 min read

ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేశారు. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారు. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం అవుతుంది GOMs.No.66, తేదీ 22-10-2022 01.01.2022 నుండి అమలులోకి వచ్చే DA పెంపుతో కరువు భత్యం 20.02% నుండి 22.75%కి చేరిక
ఈ మంజూరైన డియర్నెస్ అలవెన్స్, జూలై, 2023 జీతంతో పాటు ఆగస్టు, 2023లో చెల్లించబడుతుంది.
01.01.2022 నుండి 30.06.2023 వరకు డియర్నెస్ అలవెన్స్ చెల్లింపు ఖాతాపై బకాయిలు చెల్లించబడతాయి.
సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు
మార్చి 2024 నెలల్లో మూడు సమానవాయిదాలలో PF ఉద్యోగులకు జనరల్ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాకు జమ మరియు CPS ఉద్యోగులకు 90% DA బకాయిలు క్యాష్ రూపం లో చెల్లింపు చేస్తారట.
వీడియో చూడండి












Comments