top of page

Search Results

684 results found with an empty search

Blog Posts (660)

  • డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమావేశం - నిర్ణయాలు

    దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం, అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నా. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... క్వాలిటీ మెరుగుపర్చకపోతే నష్టపోయేది పిల్లలు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఓపెన్ మార్కెట్ తో పోటీపడాలి. ఇందుకోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేశాం. వరల్డ్ క్లాస్ బెస్ట్ మోడల్ ఆఫ్ పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ నా లక్ష్యం, ఇందుకోసం అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. బిడ్డల భవిష్యత్తు కేంద్రంగా నిర్ణయాలు ఈ సమావేశం కేవలం సమీక్ష కోసం కాదు, యాక్షన్ ప్లాన్ కోసం ఏర్పాటుచేశాం. నేను విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో రాష్ట్రస్థాయి విజిబిలిటీ, కనీస డేటా అందుబాటులో లేదు. పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడే నేను కేవలం మూడునెలల్లో పూర్తిస్థాయి సమాచారంతో డ్యాష్ బోర్డు తయారుచేశాం. విద్యాశాఖలో కనీస డేటా బేస్ అందుబాటులో లేని పరిస్థితి నుంచి విద్యాశాఖలో నా ప్రయాణం ప్రారంభించాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మన సొంత బిడ్డల్లా భావించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బిడ్డల భవిష్యత్ కేంద్రంగా నిర్ణయాలు ఉండాలి. డ్యాష్ బోర్డు ప్రకారం యాక్షన్ ప్లాన్ దిశగా డీఈవోలు, ఏపీసీలు పనిచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది పిల్లలు డ్రాపవుట్స్ గా ఉన్నారు. నెవర్ ఎన్ రోల్డ్ పై కూడా ఫోకస్ చేయాలి. నూరుశాతం ఎన్ రోల్ మెంట్ పై అధికారులంతా దృష్టిపెట్టాలి. యువగళం పాదయాత్ర సమయంలో నేను కర్నూలు జిల్లాలో పర్యటించేటప్పుడు వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పొలం పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో ప్రాపర్ ట్రాక్ మెకానిజం ఉండాలి. ఉద్యమంలా జీఎఫ్ఎల్ఎన్ చేపట్టాలి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ను ఒక ఉద్యమంగా అమలుచేయాలి. వాస్తవాలు తెలుసుకున్నపుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. నిజం చేదుగా, అబద్ధంగా తీయగా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరిస్తేనే మన ప్రయాణం సరైన దిశగా సాగుతుంది. మేం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు సరైన సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం 9వ తరగతికి క్లిక్కర్ టెక్నాలజీ అమలు చేస్తున్నాం, క్రోమ్ బుక్స్ అందించబోతున్నాం. నూరుశాతం జీఎఫ్ఎల్ఎన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. 5శాతం వెనుకబడటం అంటే సాధారణమైంది కాదు. వాస్తవంలో అది లక్షల సంఖ్యలో ఉంటుంది. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10శాతం ఎన్ రోల్ మెంట్ ఇంప్రూవ్ చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం సమిష్టిగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం నింపిన విద్యాశాఖ ప్రకటన ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్, ప్రతిభావంతమైన టీచర్లు ఉన్నారు. పదోతరగతి ఫలితాలపై ఇటీవల తొలిసారి ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. అది పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల ప్రణాళిక బాగా ఉపకరించింది. అది అవసరం లేకుండానే ట్రాన్సిషన్ జరిగాలి, ఫౌండేషన్ పకడ్బందీగా ఉండాలి. దానిపై అధికారులంతా శ్రద్ధ వహించాలి. రెండేళ్లలో రాష్ట్రమంతటా స్మార్ట్ కిచెన్లు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్ల మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ ప్రవేశపెట్టాం. దీనిపై అధికారులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిటికల్ ఇన్ ఫ్రా కోసం ప్రభుత్వం నుంచి నిధులిస్తున్నాం. ఇందుకోసం అవసరమైతే దాతల సహకారం తీసుకోండి. ప్రతి పాఠశాలకు లీక్ ప్రూఫ్ బిల్డింగ్, పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, టాయ్ లెట్, బెంచిలు కచ్చితంగా ఉండాలి. బేసిక్ ఇన్ ఫ్రా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలన్నదే మా ధ్యేయం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కడపలో స్మార్ట్ కిచెన్ అద్భుతంగా చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుచేస్తాం. ఇంటర్నేషనల్ స్కూలుగా నిడమర్రు పాఠశాల మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు స్కూలును ఇంటర్నేషనల్ స్కూలుగా తీర్చిదిద్దుతున్నాం. అక్కడ తొలిసారి నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. నెల్లూరులో కూడా రెండు స్కూల్స్ ను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక పాఠశాలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దాలని అధికారులను కోరుతున్నా. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అనే కాన్సెప్ట్ అమలులో ఉంది. నిడమర్రులో మేం కల్పించిన అత్యుత్తమ సౌకర్యాల వల్ల పక్క నియోజకవర్గాల వారు మా నియోజకవర్గానికి తమ బిడ్డల అడ్మిషన్ కోసం నివాసం మార్చుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి కల్పించే లక్ష్యంతో పనిచేయాలి. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నా. బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలి నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు తెచ్చా. ఉపాధ్యాయులు బోధనపైనే దృష్టిపెట్టాలి. అధికారులు అడ్మినిస్ట్రేషన్ పై శ్రద్ద వహించాలి. లీప్ యాప్ ద్వారా పనివిధానాన్ని మెరుగుపర్చుకోవాలి. గతంలో విజిబిలిటీ లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం విధానానికి లీప్ యాప్ కేంద్రంగా ఉంటుంది. రాష్ట్ర, జిల్లా, మండల, స్కూలు స్థాయిలో ఒకేవిధమైన డేటా ఉండాలి. లక్ష్యసారూప్యత ఉండాలి. డ్యాష్ బోర్డుపై శ్రద్ధపెట్టాలి. ఇదంతా పూర్తయ్యాక పబ్లిక్ డ్యాష్ బోర్డుకు యాక్సెస్ ఇస్తాం. పాల్, ఏఐ బేస్ లెర్నింగ్, ఏఐ ట్యూటర్ త్వరలోనే అమలు చేయబోతున్నాం. నైతిక విలువలు ముఖ్యం టెక్నాలజీతోపాటు నైతిక విలువలు చాలా అవసరం. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారికి కేబినెట్ హోదాతో అడ్వయిజర్ గా పెట్టాం. ప్రతి శనివారం వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పై దృష్టిపెట్టాలి. ఒక సోషల్ మీడియా పోస్టులో కొడుకు తల్లిని చంపే పరిస్థితి చూశాను. నైతిక విలువల బోధనతో ఇటువంటి ఘటనలను నివారించే అవకాశముంది. విద్యాశాఖపై పవిత్రమైన బాధ్యత ఉంది. జెండర్ సెన్సిటివిటీ కూడా చాలా ముఖ్యం. ఉపాధ్యాయులకు ఎక్స్ పోజర్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాం, యోగా, స్పోర్ట్స్ పై శ్రద్ధ పెడుతున్నాం. స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం. శాప్ ద్వారా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. విద్యాశాఖ వద్దని చాలామంది నన్ను వారించినా సమాజంలో నేను ఆశించిన మార్పు విద్యతోనే సాధ్యమని నమ్మి ఈ శాఖను తీసుకున్నాను. నూరుశాతం ఫలితాలు సాధించినపుడే నేను విద్యాశాఖ మంత్రిగా సంతృప్తి చెందుతా. అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పవిత్ర బాధ్యత మనందరిపై ఉందని మంత్రి లోకేష్ చెప్పారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులు హెచ్ఆర్ డీ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ... పాఠశాల విద్య భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమావేశం ఏర్పాటుచేశాం. గత రెండేళ్లలో పాఠశాల విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని సంస్కరణలు చూశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అనేకసార్లు మంత్రి లోకేష్ గారు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షించి దశ,దిశ నిర్దేశించారు. ఒక్కోసారి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు నిర్వహించారు. వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు నిరంతరం చర్చలు జరిపారు. రెండేళ్లలో విద్యాశాఖలో గుణాత్మకమైన మార్పులు తెచ్చిన మంత్రిగారికి ధన్యవాదాలు. కఠినమైనప్పటికీ వాస్తవాన్నే చెబుదాం, మంత్రి గారు ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటివరకు ముందుకుసాగాం. కొంతవరకు సఫలీకృతమయ్యాం. ఇప్పుడు మనం సంస్కరణల దశ నుంచి కన్సాలిడేషన్ వైపు వెళ్తున్నాం. ఈ స్థితిలో ఎదుగుతున్న మొక్కను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే వరకు నిర్విరామంగా కృషిచేయాలి. లక్ష్యాలపై క్లియర్ డెడ్ లైన్ పెట్టుకొని జవాబుదారీతనంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి తమీమ్ అన్సారియా, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

  • AGI (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) అంటే ఏమిటి? ఇది సాధారణ AI కంటే ఎలా భిన్నంగా ఉంటుంది?

    ఈ రోజుల్లో టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ విన్నా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI - Artificial Intelligence) గురించే చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవల కాలంలో టెక్ నిపుణులు, శాస్త్రవేత్తలు ఎక్కువగా చర్చిస్తున్న మరో కొత్త పదం 'AGI' లేదా 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (Artificial General Intelligence). అసలు ఈ AGI అంటే ఏమిటి? ఇది మనం ప్రస్తుతం వాడుతున్న సాధారణ AI కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక నిర్దిష్ట పనిని చేయడానికి లేదా ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ప్రోగ్రామ్ చేయబడిన ఒక కంప్యూటర్ సిస్టమ్. దీనిని సాంకేతిక పరిభాషలో 'నారో ఏఐ' (Narrow AI) అని కూడా అంటారు. ఉదాహరణలు:  మనం రోజువారీ జీవితంలో వాడుతున్న సిరి (Siri), అలెక్సా (Alexa), గూగుల్ అసిస్టెంట్, ఫేస్ రికగ్నిషన్, ఆన్‌లైన్ షాపింగ్‌లో వచ్చే రికమండేషన్లు, అలాగే ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందిన చాట్‌జిపిటి (ChatGPT) - ఇవన్నీ AI కిందకే వస్తాయి. ఇవి ఒక నిర్దిష్ట పనిలో మనుషుల కంటే వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేయగలవు. కానీ వాటికి నిర్దేశించిన పరిధికి మించి స్వతహాగా ఆలోచించలేవు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అనేది ఒక సైద్ధాంతిక భావన (Theoretical concept). మనుషులకు సమానమైన లేదా అంతకంటే మెరుగైన మేధస్సును, ఆలోచనా శక్తిని యంత్రాలకు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఒక సాధారణ మనిషి ఏ విధంగానైతే కొత్త విషయాలను నేర్చుకుని, అర్థం చేసుకుని, వాతావరణానికి అనుగుణంగా మారి విభిన్న రకాల సమస్యలను పరిష్కరించగలడో.. AGI కూడా సరిగ్గా అలాగే చేయగలదు. AGI కి ప్రతి చిన్న పనికీ ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. తనంతట తానుగా నేర్చుకుని, తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అసాధారణ సామర్థ్యం దీనికి ఉంటుంది. AGI మరియు AI మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు (Differences between AGI and AI) ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు: 1. పని పరిధి (Scope and Capabilities): AI:  ఇది కేవలం ఒక నిర్దిష్ట విభాగానికి మాత్రమే పరిమితం (ఉదాహరణకు చెస్ ఆడటం, లేదా భాషను అనువదించడం). AGI:  ఇది మనిషి చేయగల ఏ బౌద్ధిక పనినైనా చేయగలదు. ఒకే సిస్టమ్ కారు నడపగలదు, వైద్య చికిత్స సూచించగలదు, వ్యాపార వ్యూహాలను కూడా రచించగలదు. 2. నేర్చుకునే విధానం, అనుకూలత (Learning and Adaptability): AI:  AI కి కొత్త పరిస్థితులు ఎదురైతే లేదా ముందస్తు డేటా లేకపోతే తడబడుతుంది. AGI:  AGI కొత్త పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానాన్ని మరో కొత్త సమస్యను పరిష్కరించడానికి కూడా సులభంగా ఉపయోగించగలదు. 3. ప్రస్తుత స్థితి (Current Status): AI:  ఇది ప్రస్తుతం వాస్తవం. ప్రతిరోజూ మన ఇళ్లలో, ఆఫీసుల్లో వివిధ రూపాల్లో దీనిని ఉపయోగిస్తున్నాం. AGI:  ఇది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. భవిష్యత్తులో సాధించాల్సిన ఒక గొప్ప లక్ష్యం మాత్రమే. పూర్తిస్థాయి AGI సిస్టమ్‌ను ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ అభివృద్ధి చేయలేదు. AGI తో భవిష్యత్తులో ఉపయోగాలు: AGI గనక నిజంగా అందుబాటులోకి వస్తే మానవ చరిత్రలో అదొక అతిపెద్ద విప్లవం అవుతుంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మందుల ఆవిష్కరణ, వాతావరణ మార్పుల నివారణ, పేదరిక నిర్మూలన వంటి సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యలను వేగంగా పరిష్కరించడంలో AGI కీలకంగా మారుతుంది. అయితే, ఇంతటి శక్తివంతమైన AGI ఒకవేళ మానవుల నియంత్రణ దాటిపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. అందుకే దీని అభివృద్ధిలో అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, AI అనేది ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం ఉన్న 'స్పెషలిస్ట్' అయితే, AGI అనేది ఏ పనైనా ఇట్టే నేర్చుకుని చేయగల ఒక 'సూపర్ హ్యూమన్' లాంటిది. ఈ సూపర్ హ్యూమన్ టెక్నాలజీ ఎప్పుడు మన ముందుకు వస్తుందో వేచి చూడాల్సిందే! ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే, మీ మిత్రులతో షేర్ చేయండి. ఏవైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

  • పెండింగ్ బిల్లులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏ విషయాలు చర్చించారంటే..

    ఏపీ ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(గురువారం) ఏపీ ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దానిపై కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరుపుతున్నామని అధికారులు వివరించారు. చెల్లింపుల వివరాలు ఇలా.. ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని, అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి సంబంధించిన రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. వీటితోపాటు గ్రాట్యుటీ బకాయిల కింద రూ.3,411 కోట్లు, పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవ్‌ల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మరో రెండు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని చంద్రబాబుకు అధికారులు చెప్పారు. తల్లికి వందనం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతోంది ఉద్యోగులకు మాత్రమేనని ముఖ్యమంత్రికి వివరించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. బిల్లులు అడిగితే వేధింపులా..? ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. నాడు ఉద్యోగుల సొంత సొమ్మును కూడా వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తమ నిధుల కోసం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించారనే అంశం చర్చకు వచ్చింది. మరోవైపు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు, మెటీరియల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైనా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల బకాయిలు చెల్లించామని అధికారులు తెలిపారు. బిల్లుల చెల్లింపు ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

View All

Other Pages (20)

  • News (All) | AP TEACHERS TV

    Latest News 22, మార్చి 2023 Best smart wearables of 2023 This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More 21, మార్చి 2023 Gadget review: release of new Airy Pods This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More 20, మార్చి 2023 Long-term benefits of clean energy sources This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More 19, మార్చి 2023 How technology can help curb attention disorders This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More 18, మార్చి 2023 Entering a new era of IoT This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More 17, మార్చి 2023 5 most promising Fintech startups This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More

  • Items (All) | AP TEACHERS TV

    Item List This is a Title 01 This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More This is a Title 02 This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More This is a Title 03 This is placeholder text. To change this content, double-click on the element and click Change Content. Read More

  • Items1

    Item List

View All
bottom of page