Ap news: ఇక మూల్యాంకన పుస్తకాలు
- AP Teachers TV
- 14 hours ago
- 2 min read
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ షీట్తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి.
పరీక్ష రాసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకం
ఆరో తరగతి విద్యార్థులకు ఆగస్టు వరకు బ్రిడ్జి కోర్సు
పదో తరగతి ప్రీఫైనల్ నాటికి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి
పాఠశాల విద్యలో కొత్త ఏడాదిలో సంస్కరణలు

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ షీట్తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించే నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ పరీక్షలకు సంబంధించిన జవాబులను ఈ మూల్యాంకన పుస్తకంలోనే రాయాల్సి ఉంటుంది. గతంలో విడివిడిగా జవాబుపత్రాలు ఇచ్చేవారు. ఒక పరీక్ష ముగిశాక మార్కులను నమోదు చేసి వాటిని మూలన పడేసేవారు. అలాకాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈసారి పుస్తక రూపంలో తెచ్చారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఎప్పటికప్పుడు ప్రశ్నపత్రాలనురూపొందిస్తుంది. వీటితోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో పరీక్షలు ఎలా రాశారు? ఎన్ని మార్కులొచ్చాయనే దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పరీక్ష ముగిశాక ఉపాధ్యాయులు ఈ పుస్తకంలోనే మూల్యాంకనం చేసి ఓఎంఆర్ షీట్లో మార్కులు వేసి లీప్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లోనే విద్యార్థుల అభ్యాసాన్ని విశ్లేషిస్తారు. పునశ్చరణ తరగతులు అవసరమున్నవారిని గుర్తించి ఉపాధ్యాయులకు సమాచారమిస్తారు. అధికారులు పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు ఈ మూల్యాంకన పుస్తకాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రాథమిక విద్య తర్వాత బ్రిడ్జి కోర్సు
జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు ఒకటి వరకు ఆరో తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్య స్థాయిలో కొందరు విద్యార్థులు వెనుకబడి ఉండడం, మరికొందరికి బేసిక్స్పై పట్టు లేకపోవడం సహజం. ఇలాంటివారికి ఆరో తరగతిలో చేరిన వెంటనే బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. వారికి ప్రాథమిక స్థాయిలో 1-5 తరగతుల వరకు నేర్చుకోవాల్సిన అంశాలను బోధిస్తారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య-1,2 పూర్తి చేసి వచ్చే విద్యార్థులకు ఒకటో తరగతిలో ఆరు వారాలపాటు ప్రత్యేకంగా బోధిస్తారు. ఒకటో తరగతికి సన్నద్ధం చేస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించారు.
ముందుగానేసిలబస్ పూర్తి
తొమ్మిదో తరగతి విద్యార్థుల సిలబస్ను ముందుగానే పూర్తి చేసి వారికి నెలపాటు పదో తరగతి పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళిక రూపొందించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పడంతోపాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా సన్నద్ధమవ్వాలి? ఆయా పాఠాలకు అవసరమయ్యే వీడియోల రూపకల్పనలాంటి అంశాలపై అవగాహన కల్పించేలా టీచర్లకు హ్యాండ్బుక్ను తీసుకొచ్చారు. ఈ హ్యాండ్బుక్లో పాఠ్యాంశాలకు సంబంధించి క్యూఆర్ కోడ్తో వీడియోలను ఉంచారు.
Comentários