పిల్లలకు డిగ్రీ విద్యార్థులతో పాఠాలు...
- AP Teachers TV
- Dec 27, 2022
- 1 min read

పిల్లలకు డిగ్రీ విద్యార్థులతో పాఠాలు !
ప్రభుత్వ పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంచేందుకు అభ్యసన అభివృద్ధి స్థాయి లిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంచేందుకు అభ్యసన అభివృద్ధి స్థాయి(లిప్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉన్నత విద్యామండలి సహకారంతో డిగ్రీ విద్యార్థులతో బోధన చేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి, వారి ద్వారా పిల్లల్లో ఉన్న అభ్యసన అంతరాలను తొలగించడానికి పని చేస్తామని వెల్లడించారు



Comments