top of page

Search Results

652 results found with an empty search

  • Satellite internet: స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌

    స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ప్రత్యేక పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అవసరం లేదు స్టార్‌లింక్‌ సేవలతో పోలిస్తే భిన్నం ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో వొడాఫోన్‌ఐడియా భాగస్వామ్యం దిల్లీ: స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు పోటీ సంస్థే ఏఎస్‌టీ. అంతరిక్ష ఆధారిత సెల్యులార్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను తీసుకొస్తున్న తొలి, ఏకైక కంపెనీ ఇదే. వాణిజ్య సేవలు, ప్రభుత్వ అప్లికేషన్ల కోసం ఈ నెట్‌వర్క్‌ను డిజైన్‌ చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా వివరించింది. ‘భారత్‌లో మొబైల్‌ అనుసంధానం లేని ప్రాంతాల్లో విస్తరించడం కోసం ఇరు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. అంతరిక్షాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత మొబైల్‌ ఫోన్లలోనే వాయిస్, వీడియో కాల్‌ సేవలు అందించడం ద్వారా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చరిత్ర సృష్టించింద’ని వెల్లడించింది.  విప్లవాత్మక సాంకేతికత ఇది:  ‘అదనంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ లేదా పరికరాల సహకారం లేదా అప్‌డేట్‌ల అవసరం లేకుండానే, స్మార్ట్‌ఫోన్లకు నేరుగా స్పేస్‌ ఆధారిత సెల్యులార్‌ నెట్‌వర్క్‌ను అందించే వీలును ఏఎస్‌టీ, వొడాఫోన్‌ఐడియా భాగస్వామ్యం కల్పిస్తోంది. వొడాఫోన్‌కున్న దేశీయ నెట్‌వర్క్, ఏఎస్‌టీకున్న విప్లవాత్మక సాంకేతికత ఒక దగ్గరికి వచ్చింద’ని పేర్కొంది.  అంతరిక్షం నుంచే 4జీ, 5జీ సేవలు: ‘మా అంతరిక్ష ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఎలా పనిచేస్తుందో నిరూపించడానికి భారత్‌ వంటి విస్తృత, చురుకైన టెలికాం మార్కెట్‌ సరైన ఎంపిక అవుతుంది. మా కవరేజీని విస్తృతం చేయడంతో పాటు, కనెక్టివిటీకి ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచే 4జీ, 5జీ  సేవలు అందిస్తామ’ని ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ ఐవరీ పేర్కొన్నారు.  స్టార్‌లింక్‌ ఇస్తుంది కానీ..: మనదేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు  టెలికాం విభాగం (డాట్‌) లైసెన్సు మంజూరు చేసింది. అయితే స్టార్‌లింక్‌ సేవలు పొందాలనుకునేవారు ప్రత్యేకంగా పరికరాలను కొనాల్సి ఉంటుంది. స్టార్‌లింక్‌తో అంబానీకి చెందిన జియో, సునీల్‌ మిత్తల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు కంపెనీలకు మనదేశ టెలికాం విపణిలో 70 శాతానికి పైగా వాటా ఉంది. ఏఎస్‌టీ నెట్‌వర్క్‌ మాత్రం ప్రత్యేక పరికరాలు లేకుండానే, నేరుగా 4జీ, 5జీ సేవలను మొబైల్‌కు అందిస్తామంటోంది. ఈ సేవలను ఎపుడు ప్రారంభించేదీ వొడాఫోన్‌ ఐడియా వెల్లడించలేదు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధి ‘సరైన సమయంలో సమాచారం ఇస్తామ’ని మాత్రమే తెలిపారు. వొడాఫోన్‌ ఐడియా ప్రమోటరు సంస్థ వొడాఫోన్‌ పీఎల్‌సీ ఇప్పటికే ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది.

  • DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల పునర్నియామకం కోసం సూచనలు

    ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల కోసం సూచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, మంగళగిరి నుండి డైరెక్టర్ శ్రీ విజయ్ రామ రాజు.V, IAS గారి అధ్యక్షతన జారీ చేయబడిన ఆదేశాలు: తేదీ: 18.06.2025 విషయం: 2025-26 విద్యా సంవత్సరానికి DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల స్థానాల కేటాయింపు - సూచనలు జారీ. సూచనలు: 1. ప్రభుత్వ మెమో నెం.2809835/సర్వీసెస్-1/A2/2025, తేదీ: 06.05.2025. 2. ఈ కార్యాలయ మెమో నెం.20/24/2021-EST 3, తేదీలు: 15.05.2025 & 11.06.2025. 3. G.O.Ms.No. 22 SE, తేదీ: 20.05.2025. ఆదేశం: పైన పేర్కొన్న సూచనల ఆధారంగా, ప్రభుత్వం DSC 2008 మరియు DSC 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల సేవలను 01.06.2025 నుండి 30.04.2026 వరకు 11 నెలల పాటు, ఒక నెల విరామంతో, "పని లేకపోతే జీతం లేదు" సూత్రం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి పునరుద్ధరించడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన సజావుగా సాగేందుకు ఆర్థిక శాఖ సమ్మతితో జరిగింది. అదనంగా, G.O.Ms.No.22, తేదీ: 20.05.2025 ప్రకారం, పాఠశాల విద్యాశాఖ హెడ్ మాస్టర్/ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను చేపట్టి, ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు క్రింది సూచనలను అనుసరించి DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయులకు స్థానాలను కేటాయించాలని ఆదేశించబడింది: 1. ప్రాధాన్యత క్రమం: - మొదటి ప్రాధాన్యత DSC 2008 అభ్యర్థులకు, ఆ తర్వాత DSC 1998 అభ్యర్థులకు ఇవ్వాలి. 2. స్థానాల కేటాయింపు కోసం పాటించాల్సిన ప్రమాణాలు: i. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ SGT పోస్టులు మంజూరు చేయబడినా, ఒక్క ఉపాధ్యాయుడు కూడా పనిచేయని పాఠశాలలు. ii. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ SGT పోస్టులు మంజూరు చేయబడినా, కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్న పాఠశాలలు. iii. మోడల్ ప్రైమరీ పాఠశాలలు (4+1): 4+1 SGT పోస్టులు మంజూరు చేయబడి, ఒక SGT మాత్రమే పనిచేస్తున్న చోట రెండు మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయులను కేటాయించాలి. iv. మోడల్ ప్రైమరీ పాఠశాలలు (3+1): 3+1 SGT పోస్టులు మంజూరు చేయబడి, ఒక SGT మాత్రమే పనిచేస్తున్న చోట ఒక మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుడిని కేటాయించాలి. v. మూడు ఉపాధ్యాయుల పాఠశాలలు: 3 SGT పోస్టులు మంజూరు చేయబడినా, ప్రస్తుతం కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్న పాఠశాలలు. 3. అదనపు SGTల కేటాయింపు: - జిల్లాలో అదనపు SGTలు ఉంటే, వారిని కేటగిరీ IV నుండి I వరకు క్లస్టర్‌లకు అనుపాతంలో కేటాయించాలి. - ఇంకా అదనపు MTS SGTలు ఉంటే, మొదట కేటగిరీ IV క్లస్టర్‌లకు, ఆ తర్వాత కేటగిరీ III క్లస్టర్‌లకు కేటాయించాలి. అదనపు సూచనలు: రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారులు పైన పేర్కొన్న ఖాళీలను గుర్తించి, మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయులను పాఠశాలలకు కేటాయించాలి. ఈ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా, ఈ కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలి. ఈ ప్రక్రియను 20.06.2025 నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలి. సంతకం: విజయ్ రామ రాజు.V డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వీరికి: - రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు. - రాష్ట్రంలోని అన్ని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, పాఠశాల విద్యాశాఖ (సమాచారం కోసం). - DSE పేషీకి కాపీ.

  • LEAP: School Attendance App New Update

    LEAP App New Update The LEAP (Learning Excellence in Andhra Pradesh) App is a platform that consolidates digital tools for schools, teachers, students, and administrators. It includes features like student profile information, attendance tracking, and school resource details. The current version of the app is 3.1.3. What's new Added summary video module in student login About this app Learning Excellence in Andhra Pradesh, School Education Department Learning Excellence in Andhra Pradesh (LEAP) App is a revolutionary step by the School Education Department, Government of Andhra Pradesh by duly consolidating multiple digital tools into a single, efficient platform. This app provides multiple services related to Schools, Teachers, Students, and Administrators to improve governance through a detailed dashboard. Leap includes profile information of students, teachers, schools, school resources, fund allocation details, student attendance tracking, MDM function tracking, and other student entitlement functions, as well as maintenance of school infrastructure and more

  • సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో)

    సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో) IMMS App ఓపెన్ చేయండి User Name నమోదు చేయండి Password నమోదు చేయండి (PM Poshan) Mid Day Meals పై క్లిక్ చేయండి HM Services పై క్లిక్ చేయండి Rice Receipt పై క్లిక్ చేయండి Get Transit Details పై క్లిక్ చేయండి Transit Details downloaded successfully అనే సందేశం చూపబడుతుంది. ఈ సమయంలో Year మరియు Month ఎంపిక చేసుకునే అవకాశం వస్తుంది. Year మరియు Month ను ఎంచుకోండి. తరువాత ఈ విధంగా వివరాలు కనిపిస్తాయి: Truck chit No.: ABCDEF Truck Number: APXX AB XXXX Dispatch Date: XX/XX/XXXX Commodity Name Commodity Name పై క్లిక్ చేయండి (ఉదా: Jaggery / F Fine Rice) మీరు ఎంచుకున్న Commodity వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే Confirm చేయండి. ఈ దశలో ఒక సందేశం కనిపిస్తుంది: OTP will be sent to the selected Employee Aadhar tagged mobile number. Choose One Role for OTP Authentication పై క్లిక్ చేయండి. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల జాబితాలోంచి ఒకరిని ఎంపిక చేసుకోండి. Proceed పై క్లిక్ చేయండి. QR కోడ్ ఉన్న బస్తాల సంఖ్యను నమోదు చేయండి. QR కోడ్ లేని బస్తాల సంఖ్యను నమోదు చేయండి. Next పై క్లిక్ చేయండి. ఈ దశలో సందేశం వస్తుంది: Click here to scan Rice bags QR code (అన్ని బస్తాలపై ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేయండి). GET OTP పై క్లిక్ చేయండి. ఎంపిక చేసిన ఉపాధ్యాయుడి మొబైల్ నంబరుకు వచ్చిన OTP నమోదు చేయండి. Submit పై టాప్ చేయండి. ✅ Details Submitted Successfully

  • Corona virus: దేశంలో 3,758కి చేరిన కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. ఈ వైరస్‌పై WHO ఏం చెప్పిందంటే?

    దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది.  కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్‌ 1న ఉదయం 8గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. Corona virus: దేశంలో 3,758కి చేరిన కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. ఈ వైరస్‌పై WHO ఏం చెప్పిందంటే? దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది.  కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్‌ 1న ఉదయం 8గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలోనే 1400 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 485, దిల్లీ 436, గుజరాత్‌ 320,  పశ్చిమ బెంగాల్‌ 287, కర్ణాటక 238, ఆంధ్రప్రదేశ్‌23, తెలంగాణ 3 చొప్పున.. ఇలా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 3758 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఈ ఏడాది కొవిడ్‌ సంబంధిత మరణాలు 28కి చేరాయి.  డబ్ల్యూహెచ్‌వో ఏమందంటే? కొవిడ్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ( WHO )ఇటీవల స్పందించింది. వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8.1 సబ్‌ వేరియంట్లను ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు’గా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆస్పత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని మే 23న పేర్కొంది. ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్‌ వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ మరోవైపు, ఐసీఎంఆర్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నమూనాల ద్వారా ఈ కొత్త వేరియంట్లు ఒమిక్రాన్‌ జాతికి చెందిన ఉప రకాలుగా తేలింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ శరవేగంగా విస్తరించడానికి ఒమిక్రాన్‌ కారణమన్న విషయం తెలిసిందే. అయితే, ఎల్‌ఎఫ్‌.1, ఎక్స్‌ఎఫ్‌జీ, జేఎన్‌. 1, ఎన్‌బీ. 1.8.1 వంటి వేరియంట్లను మన దేశంలో గుర్తించగా.. వీటిలో మొదటి మూడు వేరియెంట్లే ప్రబలంగా ఉన్నట్లు   ఐసీఎంఆర్‌ చీఫ్‌ రాజీవ్‌ బహల్‌ ఇటీవల తెలిపారు.  కొవిడ్‌ కేసుల పెరుగుదలపై ఇటీవల రాజీవ్‌ బెహల్‌ ‘పీటీఐ’వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తొలుత దక్షిణ భారతదేశం నుంచి నమోదైన కేసులు.. ఆ తర్వాత పశ్చిమం నుంచి, ఇప్పుడేమో ఉత్తర భారతం నుంచి వస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులన్నింటినీ  ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మోనిటరింగ్‌ చేస్తున్నామన్నారు.  ప్రస్తుతానికి ఈ ఇన్‌ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందన్న ఆయన.. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఎప్పుడైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే.. మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వైరస్ వ్యాప్తి ఎంత మేరకు ఉంది అనేది మొదట చూడాలి. గతంలో కొవిడ్‌ 19 వచ్చినప్పుడు కేసులు రెండు రోజుల్లోనే రెట్టింపు కావడం మనం చూశాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక రెండోది, కొత్త వేరియంట్లు  రోగనిరోధక శక్తిపై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనేది చూడాలి.  మూడోది, వైరస్‌ తీవ్రత ఎంతో చూడాలి. గతంతో పోలిస్తే.. ఈ వేరియంట్‌లో అంత తీవ్రత కనబడటంలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదుగానీ, అప్రమత్తంగా, సర్వసన్నద్ధతతో ఉండాలి’’ అని సూచించారు. Read More...

  • Ap news: ఇక మూల్యాంకన పుస్తకాలు

    ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్‌ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్‌ షీట్‌తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి. పరీక్ష రాసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకం  ఆరో తరగతి విద్యార్థులకు ఆగస్టు వరకు బ్రిడ్జి కోర్సు పదో తరగతి ప్రీఫైనల్‌ నాటికి తొమ్మిదో తరగతి సిలబస్‌ పూర్తి పాఠశాల విద్యలో కొత్త ఏడాదిలో సంస్కరణలు అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్‌ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్‌ షీట్‌తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించే నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్‌ పరీక్షలకు సంబంధించిన జవాబులను ఈ మూల్యాంకన పుస్తకంలోనే రాయాల్సి ఉంటుంది. గతంలో విడివిడిగా జవాబుపత్రాలు ఇచ్చేవారు. ఒక పరీక్ష ముగిశాక మార్కులను నమోదు చేసి వాటిని మూలన పడేసేవారు. అలాకాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈసారి పుస్తక రూపంలో తెచ్చారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ఎప్పటికప్పుడు ప్రశ్నపత్రాలనురూపొందిస్తుంది. వీటితోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో పరీక్షలు ఎలా రాశారు? ఎన్ని మార్కులొచ్చాయనే దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పరీక్ష ముగిశాక ఉపాధ్యాయులు ఈ పుస్తకంలోనే మూల్యాంకనం చేసి ఓఎంఆర్‌ షీట్‌లో మార్కులు వేసి లీప్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆన్‌లైన్‌లోనే విద్యార్థుల అభ్యాసాన్ని విశ్లేషిస్తారు. పునశ్చరణ తరగతులు అవసరమున్నవారిని గుర్తించి ఉపాధ్యాయులకు సమాచారమిస్తారు. అధికారులు పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు ఈ మూల్యాంకన పుస్తకాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.  ప్రాథమిక విద్య తర్వాత బ్రిడ్జి కోర్సు జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు ఒకటి వరకు ఆరో తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్య స్థాయిలో కొందరు విద్యార్థులు వెనుకబడి ఉండడం, మరికొందరికి బేసిక్స్‌పై పట్టు లేకపోవడం సహజం. ఇలాంటివారికి ఆరో తరగతిలో చేరిన వెంటనే బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. వారికి ప్రాథమిక స్థాయిలో 1-5 తరగతుల వరకు నేర్చుకోవాల్సిన అంశాలను బోధిస్తారు.  అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య-1,2 పూర్తి చేసి వచ్చే విద్యార్థులకు ఒకటో తరగతిలో ఆరు వారాలపాటు ప్రత్యేకంగా  బోధిస్తారు. ఒకటో తరగతికి సన్నద్ధం చేస్తారు. దీనికి సంబంధించి  ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించారు.  ముందుగానేసిలబస్‌ పూర్తి తొ మ్మిదో తరగతి విద్యార్థుల సిలబస్‌ను ముందుగానే పూర్తి చేసి వారికి నెలపాటు పదో తరగతి పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళిక రూపొందించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పడంతోపాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా సన్నద్ధమవ్వాలి? ఆయా పాఠాలకు అవసరమయ్యే వీడియోల రూపకల్పనలాంటి అంశాలపై అవగాహన కల్పించేలా టీచర్లకు హ్యాండ్‌బుక్‌ను తీసుకొచ్చారు. ఈ హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌తో వీడియోలను ఉంచారు.

  • AP Mega DSC: జూన్‌ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

    మెగా డీఎస్సీ పరీక్షలను జూన్‌ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్‌ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్‌ 30కి కుదించారు. ఆగస్టు రెండో వారంలో ఫలితాలు AP Mega DSC AP Mega DSC: అమరావతి: మెగా డీఎస్సీ పరీక్షలను జూన్‌ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్‌ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్‌ 30కి కుదించారు. మొదట ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల(టీజీటీ) అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు(సీబీటీ) ప్రారంభమవుతాయి. కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని పరీక్షలు మధ్యలో.. చివరిలో వచ్చేలా షెడ్యూల్‌ ఇచ్చారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జూన్‌ 8న ప్రారంభమై 10 వరకు కొనసాగుతాయి. మళ్లీ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో పరీక్షలుంటాయి. ఎస్జీటీలకు 13న మధ్యాహ్నం, 17న ఉదయం, 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీలకు జూన్‌ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, టీజీటీలకు 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు విడతల్లో కలిపి సుమారు 40 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు.  మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులతోపాటు ఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఇలాంటి వారికి ఎస్‌ఏ హాల్‌టికెట్లు జారీ చేయలేదు. కొంతమంది అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించి, ఆ తర్వాత ఎడిట్‌ చేసేందుకు ప్రయత్నించి, అది పూర్తికాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తునే పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారమే హాల్‌టికెట్లు జారీ చేశారు. ఆగస్టులో ఫలితాలు : పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు రెండో వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తం ఆరు రకాల పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అత్యధికంగా 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టులకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తం 16,347 పోస్టుల్లో క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీరికి పోటీ పరీక్ష ఉండదు. వారు సాధించిన పతకాలే ప్రామాణికంగా శాప్‌ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కలిపి 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాట్సప్‌లోనూ హాల్‌టికెట్లు: మంత్రి లోకేశ్‌ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌తోపాటు వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చని మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు

  • జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

    AP Mega DSC జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు అమరావతి:మే 31 ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూలు విడుదలైంది, ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది.. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో ఏపీతో పాటు పొరు గురాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేయబోతు న్నారు..ఇక, జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో.. ప్రతిరోజు రెండు సెషన్లలో డీఎస్సీ నిర్వహించనున్నారు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.. అయితే, ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ద్వారా నిర్వహించబోతోంది.

  • LEAP Attendance App New Update V 3.1.0

    What's new LEAP Application Version 3.1.0 About this app Learning Excellence in Andhra Pradesh, School Education Department: Learning Excellence in Andhra Pradesh (LEAP) App is a revolutionary step by the School Education Department, Government of Andhra Pradesh by duly consolidating multiple digital tools into a single, efficient platform. This app provides multiple services related to Schools, Teachers, Students, and Administrators to improve governance through a detailed dashboard. Leap includes profile information of students, teachers, schools, school resources, fund allocation details, student attendance tracking, MDM function tracking, and other student entitlement functions, as well as maintenance of school infrastructure and more.

  • Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు!

    Supreme Court: పోక్సో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అరుదైన తీర్పు ఇచ్చింది. ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పోక్సో కేసు (POCSO Case) విషయంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) అరుదైన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. అందుకు ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితే కారణమని వ్యాఖ్యానించింది. కేసు పూర్వపరాలివీ.. బాలికతో లైంగిక సంబంధం కొనసాగించినందుకు బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ట్రయల్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానిని సవాల్‌ చేస్తూ అతడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దానిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. 2023 అక్టోబరు 18న సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’’ అని సూచించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో రిట్‌ పిటిషన్‌గా స్వీకరించింది. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలుకు దాఖలు చేసింది. దాంతో ఆ తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, బాధితురాలు.. అతడిని పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, బాధితురాలితో చర్చించాలని సూచించింది.   ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కోర్టు విధించిన గడువులో నిపుణుల కమిటీ నివేదిక సీల్డ్ కవర్‌లో అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 3న ధర్మాసనం బాధితురాలితో మాట్లాడింది. ఆమె పదోతరగతి పరీక్షలు రాసిన తర్వాత ఆమెకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తాజాగా తుది తీర్పు వెలువరించింది. ‘‘ప్రస్తుతం ఆమె మేజర్‌. చట్టప్రకారం ఆ ఘటనను నేరంగానే చూస్తున్నప్పటికీ.. ఆమె దానిని అలా చూడటం లేదు. ఆ నేరం వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడనప్పటికీ.. కొన్ని ఇబ్బందికర పరిణామాలను మాత్రం ఎదుర్కొంది’’ అని పేర్కొంది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులు మరీ ముఖ్యంగా దోషి, ప్రస్తుత కుటుంబ జీవితంలో ఆమెకు ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. ఆమెకు పూర్తి న్యాయం చేయడానికి విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని చెప్పింది. దాంతో పోక్సో కేసులో దోషికి ఏ శిక్షా విధించకుండా తీర్పు ఇచ్చింది. మరిన్ని పోస్టులు చదవండి.

  • Microsoft: ఏఐ వ్యవస్థలు రూపొందించి.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయిన మైక్రోసాఫ్ట్ సిబ్బంది!

    Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పుడు వాటివల్లే తమ ఉపాధిని కోల్పోయారు. ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ( Microsoft ) తన సిబ్బందిలో మూడు శాతం మందికి ఇటీవల ఉద్వాసన పలికింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమమేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయి. అయితే, ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి (Microsoft layoffs). వాషింగ్టన్‌ ఆఫీసులో తొలగించిన 40శాతం ఉద్యోగుల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే ఎక్కువగా ఉన్నారు. ఏఐ సాధనాల వినియోగాన్ని, వాటిపై ఆధారపడటాన్ని పెంచాలని వారికి సంస్థ యాజమాన్యం కొన్ని నెలల క్రితం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో వారు పలు ఏఐ వ్యవస్థలను రూపొందించారు. ఆ వ్యవస్థలతోనే ఇప్పుడు వారి ఉద్యోగాలను సంస్థ భర్తీ చేయడం గమనార్హం. 50శాతం మేర కోడ్ రాసేందుకు ఓపెన్‌ ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించుకోవాలని తన ఆధ్వర్యంలో ఉన్న 400 మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి జెఫ్ హల్స్‌ కొన్ని వారాల క్రితం సూచించారు. తాజా తొలగింపుల్లో ఆ బృందం కూడా ఉంది. అంటే వారికి తెలియకుండానే వారి ఉద్యోగాలకు వారే ఎసరు తెచ్చుకున్నట్లయింది. జూనియర్ కోడర్స్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉన్నవారు, ఏఐ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న సిబ్బంది ఈ కొత్త లేఆఫ్‌ను ఎదుర్కొన్నారు. చివరకు మైక్రోసాఫ్ట్‌ స్టార్టప్‌లకు చెందిన ఏఐ డైరెక్టర్ గాబ్రియెలా డికీరోజ్‌ కూడా తన పదవిని కోల్పోవడం గమనార్హం. దీనిపై ఆమె స్పందిస్తూ.. చేదు రుచి కలిగిన తీపి ఇది అని పేర్కొన్నారు. సంస్థ కోసం ఎంతో కృషి చేసినవారు తమ ఉద్యోగాలను కోల్పోవడం విచారకమని వ్యాఖ్యానించారు. 2023లో 10 వేల మందికి మైక్రోసాఫ్ట్‌ ( Microsoft ) ఉద్వాసన పలికింది. అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. ‘‘మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలుచేస్తూనే ఉంటాం’’ అని ఈ లేఆఫ్‌లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందించారు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు.గత నెల మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల కృత్రిమ మేధ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ కంపెనీకి సంబంధించి 30 శాతం కోడింగ్‌ను కృత్రిమ మేధ సాయంతోనే రాస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. ఆ వ్యాఖ్యల అనంతరమే 3 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన వచ్చింది.

  • ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే : Lava Shark 5G

    Lava Shark 5G: బడ్జెట్ ధరలో లావా కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఇవే.. Lava Shark 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. లావా షార్క్‌ 5జీ (Lava Shark 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌తో, IP54 రేటింగ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ +64జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది.  6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. UNISOC T765 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 ఎంపీ డ్యూయల్‌ కెమెరా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ మొబైల్ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. విక్రయాలు ప్రారంభమయ్యాయని.. లావా ఇ-స్టోర్‌తో పాటు కంపెనీ రిటైల్‌ దుకాణాల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.  మరిన్ని పోస్టులు చదవండి 👈

bottom of page